అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Ugadi Celebrations Indur | నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ (Sarangapur Temple) పరిసరాల్లోని, సమర్థ రామదాసు చౌరస్తాలో చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి (Chhatrapati Shivaji Maharaj) ఆధ్వర్యంలో కాషాయ ధ్వజావిష్కరణ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. సమర్థ రామదాసుతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ కలిసున్న విగ్రహం వద్ద వరుసగా రెండో ఏడాది సైతం, ఉగాది పండగ సందర్భంగా కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు.
Ugadi Celebrations Indur | ఆధ్యాత్మిక స్ఫూర్తిని చాటుతూ..
ఈ కార్యక్రమానికి సారంగాపూర్ ఆలయ ప్రధాన అర్చకులు శశి మహారాజ్, నాగభూషణ్ గురుస్వామి, కార్పొరేటర్ బంటు రాము హాజరై (Temple Events) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజావిష్కరణ చేశారు. హైందవ ధర్మాన్ని, అందులోని ఆధ్యాత్మిక స్ఫూర్తి గురించి మాట్లాడారు.
Ugadi Celebrations Indur | సంస్కృతిని కాపాడుకోవాలి
శివాజీ మహారాజ్ (Shivaji Maharaj) సేవా సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ శివాజీ పాటిల్ మాట్లాడుతూ… ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు (Cultural Celebration) తెలియజేశారు. “నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం కాషాయ ధ్వజాన్ని(Saffron Flag Hoisting) ఎగురవేసేవారు. ఆ సంప్రదాయాన్ని స్మరించుకుంటూ, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన (Cultural Celebration) బాధ్యత అందరిపై ఉంది” అన్నారు. అలాగే ఉగాది పచ్చడి విశిష్టతను వివరిస్తూ, మన ఆచార వ్యవహారాలను భావి తరాలకు అందించాలని కోరారు. తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినాన్ని, ఉత్సాహంగా, ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కోరారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురోగ్యాలతో, ధన లాభాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కాషాయ ధ్వజావిష్కరణలో హనుమాన్ భక్తులు, స్వాములు (Temple Events) పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఆనంద్, బబురు, విజయ్, నాగరాజు, నగేష్, రాజు, ప్రదీప్, సాయి, సాయి రాములు, నితిన్, కార్తీక్, సంజయ్, బాబు, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, నరసింహులు, గోవింద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

