అక్షరటుడే, వెబ్డెస్క్: Ugadi Panchang Predictions | ఈ ఏడాదిలో దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయని.. ఆ నాలుగు నెలలు ప్రభుత్వాధికారులకు నరకమే (Astrology Forecast) ఉంటుందని పంచాంగ కర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఉగాదదిఇ వేడుకల్లో(Panchang Predictions 2026) సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Ugadi Panchang Predictions | ఏప్రిల్ పది నుంచి జూలై వరకు..
ఏప్రిల్ 10వ తేదీ నుంచి జూలై వరకు కాలసర్ప దోషాలు ఉన్నాయని పంచాంగ కర్త తెలిపారు. ఈ మధ్యకాలంలో కలెక్టర్లకు (Telangana News) ప్రశాంతత కరువవుతుందన్నారు. పోలీసు శాఖకు నిద్రలేని రాత్రులు ఉంటాయని ఆయన తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదని.. అధర్మాత్ములలకు పరాభవం, నీతిగా ఉండే వారికి ధర్మాత్ములకు పరాభవ నామ సంవత్సరమని ఆయన తెలిపారు.
Ugadi Panchang Predictions | మండిపోనున్న ఎండలు..
ఈ ఏడాది ఎండాకాలం మండిపోతుందని విపరీతమైన ఎండలు (Indian Astrology) కాస్తాయని శ్రవణకర్త తెలిపారు. 50 డిగ్రీల సెల్సియస్ అనేది చాలా చిన్న(Summer Heat India) విషయంగా మారిపోతుందన్నారు. విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు.
ఆగ్నేయ తూర్పు దేశాల్లో భూకంపాలు..
ఆగ్నేయ తూర్పు దేశాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ వరకు ప్రపంచంలో ఏదో ఒకచోట సునామీలు కానీ( India Weather Alerts) భూకంపాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. దక్షిణం వైపు పరిపాలించే ముఖ్యమంత్రులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు.

ఇది కూడా చదవండి: IRCTC Summer Tours | సమ్మర్ టూర్కు ఐఆర్సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

