అక్షరటుడే, వెబ్డెస్క్ : Uniform Civil Code | దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎజెండాల్లో ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు ఉన్నాయి. గతంలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక పనులను బీజేపీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతి (UCC), జమిలీ ఎన్నికల (One Nation One Election) అమలు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ప్రధాని వెల్లడించారు. బీజేపీ 47వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.
Uniform Civil Code | కాంగ్రెస్పై విమర్శలు
మోదీ కాంగ్రెస్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పురాతన పార్టీ హయాంలో బీజేపీ (BJP) కార్యకర్తలు ఎమర్జెన్సీ వంటి అనేక కష్టాలను, అణచివేతను కూడా భరించారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ (West Bengal), కేరళ వంటి రాష్ట్రాల్లో హింస ఒక రాజకీయ సంస్కృతిగా మారిందని విమర్శించారు. అక్కడ చాలా మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని అన్నారు. కాగా ఆ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Uniform Civil Code | అనేక పనులు చేశాం
ప్రతి సవాలును ఎదుర్కోవడానికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మోదీ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి వందలాది అక్రమ చట్టాలకు ముగింపు పలికామని చెప్పారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించే చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఇలాంటి పనులు బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
ఇది కూడా చదవండి : Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం
