అక్షరటుడే, వెబ్డెస్క్ : Unseasonal Rains Telangana | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత నెలలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. మూడు రోజుల పాటు వానలు పడ్డాయి. అనంతరం ఎండలు పెరిగాయి. భానుడు భగభగ మండుతున్నాడు. పగటి పూట బయటకు వెళ్లాలేని పరిస్థితి. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 18 తర్వాత తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.
Unseasonal Rains Telangana | వడగళ్ల వాన
ఫిబ్రవరి 23-24 తేదీల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతాయి. మార్చి 18 వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 36-37 డిగ్రీలు, తూర్పు తెలంగాణ 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మార్చి 18 తర్వాత వాతావరణం చల్లబడుతుంది.

Unseasonal Rains Telangana | ఆందోళనలో రైతులు
అకాల వర్షాల కబురుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు పడితే వాతావరణం చల్లబడి ఉపశమనం లభిస్తుంది. కానీ పంటలకు మాత్రం నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో వడగళ్లు, గాలివాన పడితే పంటలకు నష్టం జరుగుతుంది.
ఇది కూడా చదవండి..: Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు

