అక్షరటుడే, వెబ్డెస్క్ : US Iran Conflict | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా (America), ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. మరోవైపు టెహ్రాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ (Israel)తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇరాన్పై అమెరికా దాడులు చేసిన “అత్యంత తీవ్రమైన రోజు” మంగళవారం అవుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ సంఘర్షణకు ముగింపు పలికే అవకాశం గురించి మిశ్రమ సంకేతాలను పంపిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నేటి రాత్రి బాంబుల మోత మోగే అవకాశం ఉంది.
US Iran Conflict | భయాందోళనలో ప్రజలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బాంబులు, సైరన్ల మోతతో ఆయా దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఏ క్షణం ఎక్కడ బాంబులు పడుతాయో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో వలస కార్మికులుగా లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి గురించి ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం త్వరలో ముగుస్తుందని సోమవారం ప్రకటించారు. అయితే అది తమ చేతిలో ఉందని ఇరాన్ చెప్పడం గమనార్హం. ఐఆర్జీసీ ఇప్పట్లో దాడులు ఆపే అవకాశం లేదని తెలుస్తోంది. చర్చలకు అమెరికా ప్రతిపాదించినా.. ఇరాన్ ఒప్పుకోవడం లేదు. దీంతో యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి : Trump Russia Oil Sanctions | పుతిన్తో మాట్లాడిన ట్రంప్.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

