అక్షరటుడే, బోధన్: Ushodaya Job Mela | పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో(Ushodaya Degree College) గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు హాజరవ్వగా ఇందుకోసం 450 మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో (Bodhan Education News) పాల్గొన్నారు. 277 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.
Ushodaya Job Mela | విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉషోదయ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ (Telangana University Students) పరిధిలో ఉన్న 450 మంది విద్యార్థులు పాల్గొనగా 277 మంది విద్యార్థులకు ఉద్యోగులు (Degree College Job Fair) రావడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల నుంచి విద్యార్థులకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు.
రాణిస్తున్న విద్యార్థులు
ఈ సహకారంతోనే విద్యార్థులు ఆయా రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారన్నారు. వారికి కళాశాల అధ్యాపకులు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. భవిష్యత్తులోనూ తమ కళాశాల విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

