అక్షరటుడే, వెబ్డెస్క్ : Velugumatla Victims Justice | ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్లలో బాధితులు అందరికీ న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వం 750 మంది ఇండ్లు కూల్చివేసి 411 మందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేసిందన్నారు. దీంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నరు.
పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీ (Fact-finding Committee)ని ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఉంటారని చెప్పారు.
Velugumatla Victims Justice | ఖమ్మం బయలుదేరిన కమిటీ
ఖమ్మం వెలుగుమట్లలో ఏం జరిగిందో తేల్చడానికి ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajiguda Press Club)లో వారికి జాగృతి అధ్యక్షురాలు కవిత, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ వీడ్కోలు పలికారు. కమిటీ సభ్యులు మంగళవారం రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. బుధవారం ఉదయం వెలుగుమట్లలో పర్యటిస్తారు. అనంతరం బాధితులు, ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశం అవుతారని కవిత తెలిపారు.
దీనిని కూడా చదవండి : Moinabad Drugs Case | మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు

