అక్షరటుడే, వెబ్డెస్క్ : Wanaparthy Road Accident | వనపర్తి (Wanaparthy ) జిల్లా రేవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఎదుల రైస్మిల్ వద్ద ఆటో ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామానికి చెందిన కొందరు కోడేరు మండలం (Koderu mandal) జనుంపల్లిలో జరుగుతోన్న మంత్రాలమ్మ జాతరకు వెళ్లారు. గురువారం ఉదయం ఆటోలో వెళ్లిన వారు రాత్రి తిరుగు పయనం అయ్యారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎదుల సమీపంలో వీరి ఆటో ట్రాక్టర్ను ఢీకొంది.
Wanaparthy Road Accident | ఓవర్ టేక్ చేస్తుండగా..
ముందు వెళ్తున్న ట్రాక్టర్ను మరో ట్రాక్టర్ ఓవర్ టేక్ చేస్తోంది. ఆ సమయంలో వెనక నుంచి వీరి ఆటో రెండు ట్రాక్టర్లను ఢీకొంది. ట్రాక్టర్ల డోర్లు బలంగా తాకడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుమారి వెంకటయ్య (52) సుమిత్రమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటన అనంతరం రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Wanaparthy Road Accident | రెండు లారీలు ఢీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్ మృతి చెందాడు. మరో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
ఇది కూడా చదవండి : Nizamabad Canal Car Accident | కెనాల్లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

