అక్షరటుడే, వెబ్డెస్క్: West Indies Team Travel | పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ ప్రాంత గగనతలాన్ని పలు దేశాలు తాత్కాలికంగా మూసివేశాయి. ఈ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం భారత్కు చేరుకోవడం ఆలస్యమైంది. దీంతో ఆటగాళ్లు, సిబ్బంది తిరుగు ప్రయాణం అనిశ్చితిలో పడింది.
ఈ పరిస్థితిని గమనించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (West Indies Cricket Board) ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక విమానం కోసం మరింత కాలం వేచి ఉండటం సరైనది కాదని భావించి, అంతర్జాతీయ క్రికెట్ మండలితో చర్చలు జరిపింది. అనంతరం వాణిజ్య విమానాల్లో ఆటగాళ్లకు టికెట్లు ఏర్పాటు చేసి వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది.
West Indies Team Travel | ఈ రోజే స్వదేశాలకి..
బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు మరియు జట్టు సిబ్బంది భారత్ నుంచి బయలుదేరారు. మిగిలిన వారు కూడా ఈరోజే తమ స్వదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే సమస్యను జింబాబ్వే క్రికెట్ జట్టు కూడా ఎదుర్కొంది. మార్చి 1న దక్షిణాఫ్రికాతో తమ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత జింబాబ్వే (Zimbabmbwe) ఆటగాళ్లు కూడా భారత్లోనే ఉండిపోయారు. అంతర్జాతీయ విమాన మార్గాల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా వారి ప్రయాణం కూడా ఆలస్యమైంది.అయితే వారి కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా మీదుగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపించినట్లు ఐసీసీ అధికారులు (ICC Officers) తెలిపారు.

West Indies Team Travel | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకలపై పడుతోంది. ఈ కారణంగా పలు అంతర్జాతీయ విమాన మార్గాలు మార్చాల్సి వస్తోంది. అదే ప్రభావం టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో పాల్గొన్న కొన్ని జట్ల ప్రయాణాలపై కూడా పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంతవరకు సద్దుమణుగుతుండటంతో జట్లు తమ స్వదేశాలకు చేరుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి..: BCCI Reward India | టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!

