అక్షరటుడే, ఎల్లారెడ్డి: Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ (Yellareddy Municipal) వైస్ ఛైర్పర్సన్ భాగ్యమ్మ అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Women Empowerment | మహిళలకు సన్మానం..
ఈ సందర్భంగా మహిళలకు శాలువాలు పూలబొకేలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ (Municipal Vice Chairperson) భాగ్యమ్మ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమకు తాముగా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో రాణించేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు.
Women Empowerment | అన్ని రంగాల్లో నిలదొక్కుకునేలా..
గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో నిలదొక్కుకొని నిలవడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని భాగ్యమ్మ అన్నారు. మహిళల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళల సంపూర్ణ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాయత్రి శ్యాం, మహేశ్వరి, సిద్ది శ్రీధర్, గఫార్, తిరుపతి, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్ట్ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా

