అక్షరటుడే, వెబ్డెస్క్: Yamuna Boat Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథురలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో భక్తులను తీసుకెళ్తున్న పడవ మునిగిపోయింది. దీంతో పలువురు నీటిలో మునిగిపోయారు. కాగా.. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం.
Yamuna Boat Accident | భక్తులతో వెళ్తున్న పడవ..
యమునా నది (Yamuna River)లో భక్తులను తీసుకెళ్తున్న పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కేసీ ఘాట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు పడవల్లో ఒకటి మునిగిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది భక్తులు నీట మునిగినట్లు తెలుస్తోంది.
జిల్లా మేజిస్ట్రేట్ సి.పి.సింగ్ మాట్లాడుతూ.. “యమునా నదిలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో లుధియానా నుంచి వచ్చిన భక్తులు రెండు పడవల్లో ప్రయాణిస్తుండగా ఒకటి మునిగిపోయింది. ప్రస్తుతం ఆరు మృతదేహాలు బయటపడ్డాయి. 16 నుంచి 17 మందిని సజీవంగా రక్షించడం జరిగింది” అని తెలిపారు.
Yamuna Boat Accident | రక్షణ చర్యలు చేపట్టిన బృందాలు
ప్రమాదం విషయం తెలియగానే పోలీసు బృందాలు, డైవర్లు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 13 మందిని నది నుంచి బయటకు తీసినట్లు సమాచారం. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఐదుగురి పరిస్థితి స్వల్పంగా గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నారు.
Yamuna Boat Accident | తొమ్మిది మంది మృతి
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా.. స్థానికులు ఆరుగురి మృతదేహాలు వెలికితీసినట్లుగా తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Mathura, Uttar Pradesh: A boat carrying devotees from Ludhiana capsized in the Yamuna River, resulting in a tragic incident. Six bodies have been recovered so far, while rescue operations continue
DM CP Singh says, “Today, a very unfortunate accident occurred at around 2:45 PM… pic.twitter.com/4nnITU4CgB
— IANS (@ians_india) April 10, 2026
ఇది కూడా చదవండి..: Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్ షా
