అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Sanitation Drive | పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఎల్లారెడ్డి (Yellareddy News) మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ భాగ్యమ్మ, ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 99 రోజుల పాటు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ (Praja Palana Program) కార్యక్రమం (Clean City Campaign) ప్రారంభమైంది. ఇందులో భాగంగా శనివారం నూతన పాలకవర్గం ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ మహేష్, సిబ్బంది కలిసి వీధులను (Civic Sanitation) శుభ్రం చేశారు.
Yellareddy Sanitation Drive | బస్టాండ్ ఆవరణలో..
బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను పాలకవర్గ (Telangana News) సభ్యులు తొలగించారు. ప్రజలు సైతం పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని తడిచెత్త పొడిచెత్త వీధుల్లో వేయకుండా చెత్త వాహనాల్లోనే వేయాలని వైస్ ఛైర్పర్సన్ సూచించారు. పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గ్రామ, వార్డు స్థాయిల్లో అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
పారిశుధ్యం.. స్థానిక సమస్యలు..
పారిశుధ్యం, స్థానిక సమస్యల పరిష్కారానికి (Clean City Campaign) ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, (Yellareddy Municipal Administration) రికార్డుల నిర్వహణ, మరియు ప్రజలకు సేవలను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్రెడ్డి

