అక్షరటుడే, ఎల్లారెడ్డి: Young India Integrated Schools | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ సురేశ్ షెట్కార్ (MP Suresh Shetkar), ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) అన్నారు. లింగంపేట(Lingampet) మండలంలోని మోతె గ్రామంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్రతో (SP Rajesh Chandra) కలిసి నిర్వహించారు.
Young India Integrated Schools | విద్యార్థుల ఉన్నతికి కాంగ్రెస్ కృషి..
ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన అనంతరం వారు మాట్లాడుతూ.. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్యాంటిన్ సౌకర్యం, వసతి గృహాలు వంటి అన్ని సదుపాయాలతో ఈ విద్యాసంస్థను నిర్మిస్తున్నామని వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ విద్యా అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందన్నారు.
ఇది కూడా చదవండి: గోద్రెజ్ ప్రామిస్.. అన్ని హోమ్ అప్లయన్సెస్పై 5 ఏళ్ల ఉచిత సమగ్ర వారంటీ
