అక్షరటుడే, మెండోరా : Youth suicide phone denial | నేటి యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. టెక్నాలజీపై పెంచుకున్న వ్యామోహం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఆధునిక కాలంలో వస్తువులపై ఉన్న మక్కువ మనుషుల ప్రాణాల కంటే కూడా ఎక్కువవుతోంది. సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన యువకుడు గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా(Mendora) మండలం సోంపేట్ గ్రామంలో చోటుచేసుకుంది.
Youth suicide phone denial | సోంపేట్ గ్రామానికి చెందిన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోంపేట్ గ్రామానికి చెందిన పిండి మధు (19) తన తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై గడ్డిమందు(pesticide death) తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్లోని (Nizamabad) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా (Mendora Police) ఎస్సై సుహాసిని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad Land Scam | హైదరాబాద్లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
