అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YSRCP Chief Jagan) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకో, పంచుకో ఇదే జరుగుతోందన్నారు. ఇసుక, మట్టి, లిక్కర్, భూమి దేనిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా దోచేస్తుంటే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు.
విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన సమీప బంధువుకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి తక్కువ ధరకు భూములు ఇస్తున్నారన్నారు. అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. 2024-25లో రూ.80 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. తమ హయాంలోని పథకాలను కూడా రద్దు చేశారని చెప్పారు. కూటమి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎన్బీసీ పరిమితి కన్నా రూ.12 వేల కోట్లకు పైగా అప్పులు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3.80 లక్షల కోట్ల అప్పు చేసిందని జగన్ పేర్కొన్నారు. తమ పాలనలో ఐదేళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని తెలిపారు.
YS Jagan Corruption Allegations | ఎమ్మెల్యేల ఆటలు
రైతులు (Farmers) ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు పాడుకుంటున్నారని జగన్ విమర్శించారు. రైతులు కష్టకాలంలో ఉంటే స్కిట్లు ఏమిటని ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిందిపోయి కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారని నిలదీశారు.
YS Jagan Corruption Allegations | పాలు తాగినా చనిపోతున్నారు..
చంద్రబాబు పాలనలో పాలు, నీళ్లు తాగినా చనిపోతున్నారని జగన్ అన్నారు. ఇటీవల రాజమండ్రి కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారని ఆరోపించారు. చంద్రన్న కానుకకే దిక్కులేదని, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి..: Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!

