అక్షరటుడే, ఆర్మూర్ : Road Safety Awareness | ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత అని సీఐ జాన్రెడ్డి (CI John Reddy) అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ (Arrive Alive – Road Safety Week) కార్యక్రమాన్ని ఆంధ్ర నగర్లో నిర్వహించారు.
Road Safety Awareness | వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బైక్పై ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. కార్లలో వెళ్లేవారు సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. అధిక వేగం నివారణ ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు సభ్యులను ఎంపిక చేశారు. అనంతరం గ్రామ ప్రజలందరితో రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు. అలాగే సురక్షిత డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు 20 హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందిపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్, సర్పంచ్ వట్టిగుంట సుష్మ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Nasrullabad Theft Case | నస్రుల్లాబాద్లో దొంగల బీభత్సం.. ఏకకాలంలో ఆరు ఇళ్లలో చోరీ..
