అక్షరటుడే, వెబ్డెస్క్ : Lok Sabha Seats Increase | దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టనుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Sessions) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఒకటి మహిళా రిజర్వేషన్ (Women Reservation) బిల్లు కాగా.. మరొకటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. ఆర్టికల్ 82లోని మూడవ నిబంధన ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల ఆధారంగా తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని రాజ్యాంగం ప్రస్తుతం నిర్దేశిస్తోంది. కేంద్రం ఈ నిబంధనను తొలగించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.
Lok Sabha Seats Increase | రాష్ట్రాల్లో..
కొత్త బిల్లు ప్రకారం.. లోక్సభలో రాష్ట్రాల నుంచి గరిష్టంగా 815 మంది సభ్యులు ఉంటారు. అలాగే, పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ఉంటారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాబోయే ఎన్నికలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలును వేగవంతం చేయవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, 2002 డీలిమిటేషన్ (Delimitation) చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం డీలిమిటేషన్ బిల్లు 2026ను కూడా తీసుకువస్తోంది.
Lok Sabha Seats Increase | 2029లో అమలు
పెంచిన నియోజకవర్గాలు 2029లో అమలులోకి రానున్నాయి. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే మహిళా రిజర్వేషన్ సైతం అప్పుడే అమలు చేయనున్నారు. జనాభా ప్రతిపాదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : Women Empowerment Modi | మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు.. : ప్రధాని మోదీ
