అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | పాల్వంచ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
Kamareddy Congress | అభివృద్ధిని చూసి..
చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన బాగుందని, అందుకే తాము పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట్ గౌడ్, రాజా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామస్వామి గౌడ్, అంజా గౌడ్, నవీన్ గౌడ్, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
