హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 వేదికగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన సరికొత్త ఆర్టిస్ట్రీ స్టోర్ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. భారతీయ ఆభరణాల రంగంలోనే ఇదొక విశిష్టమైన లగ్జరీ గమ్యస్థానంగా నిలవనుంది. కేవలం ఆభరణాల విక్రయ కేంద్రంగానే కాకుండా వినియోగదారులకు వ్యక్తిగత ప్రాధాన్యతను ఇస్తూ వారి అభిరుచులకు అనుగుణంగా అత్యుత్తమ కళానైపుణ్యంతో కూడిన ఆభరణాలను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ రూపుదిద్దుకుంది. విశ్వసనీయత ప్రత్యేకమైన కొనుగోలు అనుభూతిని కలగజేస్తూ రిటైల్ రంగంలో ఇదొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కరీనా చేతుల మీదుగా..
ప్రముఖ సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ మెగా స్టోర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తో పాటు ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఓ రిటైల్ హెడ్ సిరాజ్ పి.కె. అలాగే జోనల్ హెడ్ ముహమ్మద్ షరీజ్ కె. వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక మార్పులు చేస్తూ ఈ ఆర్టిస్ట్రీ స్టోర్ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. నాణ్యత పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దీర్ఘకాలిక విలువలను అందించడమే తమ నిరంతర లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కరీనా కపూర్ ఖాన్ ఈ స్టోర్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ నేటి కాలంలో ఆభరణాలు అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదని అవి ఒక వ్యక్తి గుర్తింపును వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. ఇక్కడి ప్రతి ఆభరణం వెనుక ఉన్న శ్రద్ధ కస్టమర్ల పట్ల చూపే గౌరవం ఈ అనుభూతిని మరింత విలాసవంతంగా మార్చాయని ఆమె ప్రశంసించారు. సుమారు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్ కేవలం విక్రయాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి డిజైన్లు అత్యాధునిక సౌకర్యాలతో వినియోగదారులకు ఒక మధురమైన అనుభవాన్ని పంచుతోంది.
