అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమించింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో (Dichpally) ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా (governing body member) కామారెడ్డి (Kamareddy news) పట్టణానికి చెందిన మహమ్మద్ ఘాజిని (Mohammed Ghazi) నియమిస్తూ గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana University | విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి..
ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈసీ మెంబర్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని, విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో (university administration) నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. కాగా ఇటీవలే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఘాజి నియామకమయ్యారు.
ఇది కూడా చదవండి: Summer Food Safety | వేసవిలో ఆహారం విషతుల్యం కాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
