అక్షరటుడే, ఇందూరు: Teachers Protest | తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా టీజీఈ జేఏసీ (TGE JAC) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
Teachers Protest | సమస్యలను పరిష్కరించాలి
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని శంకర్ భవన్ పాఠశాల (Shankar Bhavan School)లో శుక్రవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఉపాధ్యాయులు గోపి, మల్లేశం, రాములు, రాజయ్య, రమేశ్, మాధవి, శ్రీలక్ష్మి, శాంతాబాయి, రజిని, పావని తదితరులు పాల్గొన్నారు.
Teachers Protest | డిమాండ్లు ఇవే..
రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ డిమాండ్లను నెరవేర్చాలని పోరుబాట పట్టారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వం రెండో పీఆర్సీ కమిషన్ (PRC Commission) నివేదికను తెప్పించి జూన్ 2లోపు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు గడుస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నారు. అంతేగాకుండా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసనలు తెలిపారు. ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.
ఇది కూడా చదవండి..: Armoor Protest | ఆర్మూర్లో వీహెచ్పీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిరసన..
