అక్షరటుడే, వెబ్డెస్క్: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మేడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామంలో సభ ఏర్పాటు చేయగా.. సభ నిర్వహించకుండా అడ్డుకోని టెంట్లను, కూర్చీలను కాంగ్రెస్ నాయకులు తొలగించారు.
మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డితో పోలీసులు చర్చలు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారే అవకాశం ఉండటంతో ఆయనకు బీఆర్ఎస్ కార్యాలయం (BRS Office)లో నిర్భందించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మేడిపల్లికి వచ్చితీరుతానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో పోలీసులు మేడిపల్లిలో 144 సెక్షన్ విధించారు.
Tension in Medipalli | బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
మేడిపల్లి (Medipally)కి రాకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఫార్మా భూముల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే మల్రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. నియోజకవర్గంలో తన హయాంలోనే పనులు చేసినట్లు కిషన్రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికే గ్రామానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి రావడంతో హై టెన్షన్ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Delimitation Bill | డీలిమిటేషన్తో కొత్త నాయకత్వం వస్తుంది : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
