అక్షరటుడే, భీమ్గల్ (వేల్పూర్): Tejasvi Surya Controversy | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejasvi Surya)పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేల్పూర్ కాంగ్రెస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సై సంజీవ్కు (SI Sanjeev) వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Tejasvi Surya Controversy | యావత్ సమాజాన్ని కించపరుస్తూ..
ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మేధావులను, అమరవీరులను, యావత్ సమాజాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడటం దుర్మార్గమన్నారు. గతంలో ప్రధాని మోదీ సైతం విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఎంపీలు అదే బాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. తేజస్వి సూర్య వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, నాయకులు నరేందర్, రమణ, మల్లయ్య, ఇంద్ర గౌడ్, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..
