అక్షరటుడే, భీమ్గల్: Loan Waiver Issue | రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాలని కోరితే, వారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ధ్వజమెత్తారు.
కమ్మర్పల్లి (Kammarpalli)కి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం ఆర్మూర్ కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఆయన వారికి సంఘీభావం తెలిపారు.
Loan Waiver Issue | 52 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం (Balkonda Constituency)లో 52 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే వర్తింపజేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మిగిలిన 30వేల మంది రైతుల (Farmers) పరిస్థితి ఏమిటని ప్రశ్నించినందుకు రైతులపై కేసులు పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. రెండేళ్లుగా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. తక్షణమే రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి, అర్హులైన వారందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి
