అక్షరటుడే, వెబ్డెస్క్: Stock Market Crash | అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్థాన్లో 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి రాలేకపోవడంతో రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటడం, రూపాయిలో తిరిగి బలహీనత కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి.
Stock Market Crash | భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,613 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 69 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 1,195 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 462 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 352 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 702 పాయింట్ల నష్టంతో 76,847 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 23,842 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,790 కంపెనీలు లాభపడగా 2,573 స్టాక్స్ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 47 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
మిక్స్డ్గా సూచీలు..
ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. యుటిలిటీ, పవర్ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 2.09 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.41 శాతం, ఎనర్జీ 1.34 శాతం, ఎఫఎంసీజీ 1.29 శాతం, ఐటీ 1.16 శాతం నష్టపోగా.. యుటిలిటీ 1.37 శాతం, పవర్ 0.89 శాతం, టెలికాం ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 3 స్టాక్స్ లాభపడగా.. 27 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.16 శాతం, ఎన్టీపీసీ 1.54 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.15 శాతం లాభపడ్డాయి.
Top Losers : మారుతి 4.61 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.80 శాతం, ఇండిగో 2.78 శాతం, రిలయన్స్ 2.64 శాతం, టీసీఎస్ 2.05 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్లో స్టాక్ మార్కెట్లు
