అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేద్దామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నగంరలోని 6వ పోలీస్స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్లో నిర్వహించిన గ్రామసభకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Traffic Rules Awareness | రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మరణాలు..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం (Arrive Alive Program) ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్ సౌత్ రూరల్ సురేష్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఆరో టౌన్ ఎస్సై వెంకట్ రావ్, జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్, ఎస్సై డి.శ్రీకాంత్, సర్పంచ్ నరాల జ్యోతి, డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
