అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ (4th Town) పరిధిలో చోటు చేసుకుంది.
Nizamabad Police | వినాయక్నగర్లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వినాయక్నగర్లో (Vinayak Nagar) జక్కలోళ్ల మోహన్(40) అనే వ్యక్తి మేస్త్రి పనిచేసేవాడు. సుమారు ఎనిమిదేళ్లుగా స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 12న తేదీ ఉదయం సదరు మహిళ మోహన్ను చీరతో మెడ చుట్టూ గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. అతడిది ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) అని మాత్రమే తెలిసినందున.. పూర్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాలుగో టౌన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. మృతుడు పనిచేసే యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్
