అక్షరటుడే, వెబ్డెస్క్: ASI Death Case | సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి చెందారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
మానూర్ పోలీస్ స్టేషన్ (Manoor Police Station)లో గోవింద్ నాయక్ ఏఎస్సైగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన విధుల్లో ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంతో ఏఎస్సై గోవింద్ నాయక్కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తోటి సిబ్బంది వెంటనే ఆయనను నారాయణఖేడ్ (Narayankhed)లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఏఎస్సై చనిపోయారు.
ASI Death Case | ప్రమాదమా.. హత్య!
ప్రమాదం జరగ్గానే హోంగార్డు రామారావు పరారు అయ్యాడు. అయితే ఏఎస్సైతో హోంగార్డుకు గతంతో విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని రామారావు కావాలనే ఏఎస్సైని వాహనం ఢీకొన్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు రామారావు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఏఎస్సై మృతిపై తోటి సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి..: Padayatra Political Strategy | పాదయాత్రతో అధికారం దక్కేనా..
