అక్షరటుడే, వెబ్డెస్క్: Ambedkar Jayanti | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాజ్యాంగాన్ని మార్చడానికి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దీంతో ప్రజలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జై భీమ్ నినాదంతో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రజలు ఏకం కావాలన్నారు.
బీఆర్ అంబేడ్కర్ జయంతి (BR Ambedkar Jayanti ) సందర్భంగా భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన దేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు.
Ambedkar Jayanti | హక్కులు లభించేలా..
అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టారని భట్టి కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించేలా కృషి చేశారన్నారు. లింగ వివక్షను పరిష్కరించడానికి ప్రయత్నించారన్నారు. కుల, మతాలకు అతీతంగా, మహిళలందరి సంక్షేమం కోసం ఆయన కృషి చేశారన్నారు. కార్మికుల పని గంటలను 12 నుండి 8 గంటలకు తగ్గించడంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు.
Ambedkar Jayanti | అంబేడ్కర్ మార్గంలో..
రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కును, స్వేచ్ఛను, మానవ హక్కులను ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుస్తుందని చెప్పారు. సామాజిక న్యాయంపై చిత్తశుద్ధితో ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా కులగణన నిర్వహించడంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Padayatra Political Strategy | పాదయాత్రతో అధికారం దక్కేనా..
