అక్షరటుడే, బోధన్: CP Advice For Students | విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. బోధన్లో ఉషోదయ ఇంటర్ మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
CP Advice For Students | భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకులు సాధించాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఉషోదయ ఇంటర్ మహిళా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అనేక ర్యాంకులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎల్లవేళలా తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుంచి కష్టపడే గుణం ఉన్నప్పుడే త్వరితగతిన భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు స్థిరపడతారని తెలియజేశారు. కావున విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కష్టపడేటటువంటి గుణం ఉండాలని అప్పుడే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు. అనంతరం రమాకాంత్ ఫంక్షన్ హాల్లో కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులు అరైవ్ అలైవ్లో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించినప్పుడే యాక్సిడెంట్లు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కాలేజీ ఛైర్మన్ ప్రకాష్, డైరెక్టర్ దుష్వంత్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), ఎస్హెచ్వో వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
