అక్షరటుడే, వెబ్డెస్క్ : Israel Lebanon Talks | ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్తో సీజ్ఫైర్ (Ceasefire) అమలులోకి వచ్చినా ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు.
34 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్ నాయకుల మధ్య ప్రత్యక్ష చర్చలు గురువారం జరుగుతాయని తెలిపారు.ఇజ్రాయెల్, లెబనాన్లు ప్రత్యక్ష చర్చలు జరుపుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి తెలిపారు. ఇరు దేశాల నాయకులు మాట్లాడుకుని చాలా కాలం అయిందన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ దక్షిణ ప్రాంతంపై తీవ్రంగా బాంబుల వర్షం కురిపిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు.
Israel Lebanon Talks | కొనసాగుతున్న దాడులు
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగున్నాయి. బుధవారం బీరూట్కు దక్షిణంగా, సాదియత్, జియే పట్టణాల సమీపంలో, హిజ్బుల్లా స్థావరాలకు వెలుపల ఉన్న తీరప్రాంత రహదారిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సైన్యం ప్రకారం ఉత్తర ఇజ్రాయెల్లోని తమ్రా పట్టణంలో, హిజ్బుల్లా సరిహద్దు దాటి సుమారు 30 రాకెట్లను ప్రయోగించడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్లోని 10 ప్రదేశాలపై తాము రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా తెలిపింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు భూతల కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, గత 24 గంటల్లో అక్కడ రాకెట్ లాంచర్లతో సహా 200కు పైగా హిజ్బుల్లా మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.
ఇది కూడా చదవండి..: Hormuz Strait Open | ప్రపంచ దేశాల కోసం హర్ముజ్ను తెరిచి ఉంచాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
