అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Gains | దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగుతుండడంతో ప్రారంభ లాభాలు తగ్గాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 566 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 53 పాయింట్లు పెరిగింది.
అక్కడినుంచి 508 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 15 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్తో 136 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 78,353 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 24,298 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | మిశ్రమంగా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో సూచీలు మిక్స్డ్గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో మెటల్ ఇండెక్స్ 1.57 శాతం, యుటిలిటీ 0.98 శాతం,క్యాపిటల్ గూడ్స్ 0.82 శాతం, ఐటీ 0.79 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, పవర్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి. టెలికాం 0.34 శాతం, ఎనర్జీ 0.25 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.23 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 22 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.35 శాతం, బీఈఎల్ 1.66 శాతం, ఎటర్నల్ 1.62 శాతం, ఎల్టీ 1.47 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.15 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్ఫార్మా 0.98 శాతం, ఎయిర్టెల్ 0.83 శాతం, టైటాన్ 0.74 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.57 శాతం, రిలయన్స్ 0.50 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: VinFast VF MPV 7 | ‘విన్ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
