అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | యాసంగి సీజన్కు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తో కలిసి శుక్రవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పహ్లాద్ జోషికి వినతి పత్రం అందించారు.
యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్ (Boiled Rice Milling)కు తెలంగాణ అనుకూలమని సీఎం వివరించారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ (Telangana)లో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు.
CM Revanth Reddy | సిద్ధంగా ఉన్నాం
యాసంగి సీజన్ (Yasangi Season)కు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని సీఎం కోరారు.
CM Revanth Reddy | ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా..
దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారన్నారు. వెంటనే దానిని పునఃప్రారంభించాలని రేవంత్రెడ్డి కోరారు.
ఇది కూడా చదవండి..: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత
