అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్వర్వులు జారీ చేశారు.
Telangana IPS Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..
- ఆసిఫాబాద్ లో పనిచేస్తున్న ఏఎస్పీ ఎస్. చిత్తరంజన్ ను అదే జిల్లాలోని అదనపు ఎస్పీ (పరిపాలన) విభాగానికి బదిలీ చేశారు.
- కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్య రెడ్డి IPS (RR:2022)ని సంగారెడ్డి అదనపు SP (Admn)గా నియమించారు.
- జనగాం ఏఎస్పీ పాండేరే చేతన్ నితిన్ ను జగిత్యాలలోని పరిపాలన విభాగంలోకి బదిలీ చేశారు.
- భద్రాచలం ఏసీపీ విక్రాంత్ కుమార్ సింగ్ను మెదక్కు బదిలీ చేశారు.
- వరంగల్ లో పనిచేస్తున్న ఏఎస్పీ శుభం ప్రకాష్ ను నిజామాబాద్ అదనపు డీసీపీ (పరిపాలన)గా బదిలీ చేశారు.
- భైంసాలోని ఏఎస్పీ రాజేష్ మీనాను అక్కడే పరిపాలన విభాగంలోకి బదిలీ చేశారు.
- ఆదిలాబాద్లో పనిచేస్తున్న ఏఎస్పీ పి.మౌనికను అదే జిల్లాలోని వేరే చోటుకు బదిలీ చేశారు.
- నిర్మల్లో పనిచేస్తున్న ఏఎస్పీ సాయికిరణ్ ను భైంసాకు ట్రాన్స్ఫర్ చేశారు.
- వేములవాడ ఏఎస్పీ Ruthwik Sai Kotte ఉట్నూర్కు బదిలీ అయ్యారు.
ఇది కూడా చదవండి: Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!
