అక్షరటుడే, వెబ్డెస్క్ : Chhattisgarh Boiler Blast | ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో (Sakti district) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘితరాయ్లోని పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలి 10 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు.
సింగితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) పవర్ ప్లాంట్లోని బాయిలర్ ట్యూబ్లో మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పలువురు కార్మికులను కూడా రక్షించినట్లు తెలిపారు.
Chhattisgarh Boiler Blast | పలువురికి తీవ్ర గాయాలు
బాయిలర్ ట్యూబ్లో పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
Chhattisgarh Boiler Blast | మెరుగైన వైద్యం
తమ ప్లాంట్లోని యూనిట్లో బాయిలర్లో పేలుడు జరిగినట్లు వేదాంత లిమిటెడ్ తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
At least four workers killed, 15 injured in blast at a private power plant in #Chhattisgarh’s Sakti district.
Injured were being rushed to neighbouring #Raigarh district for treatment. Casualties might rise, say police. pic.twitter.com/WD9Ik3A6Xt
— The Times Of India (@timesofindia) April 14, 2026
ఇది కూడా చదవండి : BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ
