అక్షరటుడే, వెబ్డెస్క్: Jubilee Hills Hit Run | హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
దీర్ఘకాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, తాజాగా నిందితుడు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట హాజరయ్యాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యతపై దృష్టి సారించారు. ఈ పరిణామం నగరంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Jubilee Hills Hit Run | అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఫిబ్రవరి 17, 2022న జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ఫుట్పాత్ వద్ద ఉంటూ బెలూన్లు, స్ట్రాబెర్రీలు విక్రయిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు వీరిని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చిన్నారి రణవీర్ పరిస్థితి విషమించి మరణించాడు.
అయితే ప్రమాదం జరిగిక కారులో ఉన్న ముగ్గురు యువకులు పారిపోయారు. ఆ కారుపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉంది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు కేసు నమోదు తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కారులో తనతో పాటు రాహిల్, మరో స్నేహితుడు మహమ్మద్ మాజ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Jubilee Hills Hit Run | ఇదిలా ఉండగా…
2023లో ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొన్న ప్రమాదంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జూబ్లీహిల్స్ కేసు గురించి తెలిసి ఈ కేసును మళ్లీ పరిశీలించారు. ఆ కేసులో పోలీసులు లొంగిపోయిన వ్యక్తి వాంగ్మూలం నమోదు చేశారు.
అందులో ప్రమాదం జరిగినప్పుడు సదరు కారు నడిపింది rahel అని తేలింది. తానే కారు నడిపినట్లు అంగీకరించాలంటూ రాహిల్ బంధువులు తనను బలవంతంగా ఒప్పించారని పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి తెలిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Vaisakha Amavasya | అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారా.. వైశాఖ అమావాస్య నాడు ఈ చిన్న పని చేస్తే రుణ విముక్తి ఖాయం!
