అక్షరటుడే, వెబ్డెస్క్: Lok Sabha Seats Increase | ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. లోక్సభ సీట్ల పెంపు విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లులను ఈ నెల 16న పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో సగటున 50శాతం స్థానాలు పెంచనున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కోరారు.
Lok Sabha Seats Increase | అందరితో చర్చించాలి
నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రతిపాదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశారు. దీంతో జనాభా పెరుగుదల ఎక్కువగా లేదు. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. దీంతో జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.
Lok Sabha Seats Increase | జీఎస్డీపీ ఆధారంగా..
సగం సీట్లను జనాభా ఆధారంగా.. మరో సగం సీట్లను రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా పెంచాలని సీఎం సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును, సీట్ల పెంపుతో కలపడం సరికాదన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లులను ఆమోదించాలని కేంద్రం చూస్తోంది.
Dear Shri @narendramodi Ji
I am writing this open letter to you in response to the latest proposal to increase Lok Sabha seats to 850.#LokSabhaDelimitation pic.twitter.com/4M566g78kU
— Revanth Reddy (@revanth_anumula) April 14, 2026
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు
