అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump Modi Call | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇరుదేశాల అధినేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మధ్యప్రాచ్య పరిస్థితి, ద్వైపాక్షిక సహకారంపై వీరు చర్చించారు.
హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఇద్దరు నేతలు నొక్కి చెప్పారు. ట్రంప్ కాల్ అనంతరం మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. “నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది” అని పేర్కొన్నారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించామన్నారు. అన్ని రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Trump Modi Call | సురక్షితంగా ఉంచాలి
పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై కూడా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. హర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాలన్నారు. ఇద్దరు నేతల మధ్య సంభాషణ జరిగిన వెంటనే, అధ్యక్షుడు ప్రధానికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటారని భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతోందనే దానిపై, అలాగే వాషింగ్టన్లో అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై అధ్యక్షుడు తాజా సమాచారం అందించారు అని చెప్పారు.
కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా మధ్య సీజ్ఫైర్ అమలులోకి వచ్చిన చర్చలు విఫలం కావడంతో ఆందోళన నెలకొంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా వ్యాఖ్యలతో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్, మోదీకి ఫోన్ (Trump Modi Call ) చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
దీనిని కూడా చదవండి : US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు
