అక్షరటుడే, వెబ్డెస్క్: Medipally Police | సమాజంలో రోజు రోజుకు నేర ప్రవృత్తి పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలతో పలువురు హత్యలు చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ మహిళ తోటి కోడలి కుమారిడికి జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించింది.
Medipally Police | బోడుప్పల్లో అమానవీయ ఘటన
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోడుప్పల్ (Boduppal)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తోటికోడలి కుమారుడిపైనే మామకు ఎక్కువ ప్రేమ ఉందనే అసూయతోనే ఓ మహిళ ఆ బాలుడిని చంపాలని నిర్ణయించుకుంది. నాగరాజు, సంధ్య అనే దంపతులకు కార్తీక్(4) అనే కుమారుడు ఉన్నాడు. కార్తీక్పై మామ ఎక్కువ ప్రేమ చూపించడాన్ని తట్టుకోలేక.. అతడ్ని చంపాలని నాగరాజు సోదరుడి భార్య మంజుల ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే.. జ్యూస్ అని చెప్పి కార్తీక్కు యాసిడ్ తాగించింది. విషయం తెలిసి మంజులపై కార్తీక్ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Medipally Police | గతంలోనూ..
తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారని మంజుల అసూయ పెంచుకుంది. కార్తీక్పై ఇంట్లో వారు ఎక్కువ ప్రేమ కనబరచడాన్ని తట్టుకోలేకపోయింది. ఇటీవల కార్తీక్ పేరును తన మామ చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో ఆమె మరింత కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో ఆ బాలుడిని అంతం చేయాలని ప్లాన్ వేసింది. ఇటీవల బాలుడి ముక్కు, గొంతు మూసి హత్యాయత్నం చేసింది. కార్తీక్ తల్లి సంధ్య గమనించి ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పింది.
అనంతరం మరో రోజు బాలుడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్పై కూర్చోబెట్టింది. గమనించిన తాత మందలించాడు. ఈ నెల 9న మంజుల కార్తీక్ను కిచెన్లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పింది. అనంతరం యాసిడ్ (Acid) తాగించింది. ఈ ఘటనపై బుధవారం బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి..: Running Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
