అక్షరటుడే, వెబ్డెస్క్: Lok Sabha | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women’s Reservation Bill), డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టింది. కీలకమైన ఈ మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) మూడు బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. రాజ్యాంగ సవరణ 131 బిల్లు ప్రవేశ పెట్టడంపై విపక్షాలు ఓటింగ్ కోరారు. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లు ప్రవేశ పెట్టడానికి మద్దుతగా.. 207 ఓట్లు, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. దీంతో సభలో బిల్లును ప్రవేశ పెట్టారు.
Lok Sabha | సుదీర్ఘంగా చర్చ
ఓటింగ్కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని స్పీకర్ తెలిపారు. 15 నుంచి 18 గంటల పాటు జరుగుతుందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు తార్కిక ముగింపునకు చేర్చడానికే ఈ రెండు బిల్లులను కలిపి తీసుకువచ్చామని వెల్లడించారు.
Lok Sabha | మహిళలకు 272 సీట్లు
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ..మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందిందన్నారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా దీనిలోని నిబంధనలను అమలు చేయాలని కొత్త బిల్లు తెచ్చినట్లు తెలిపారు. డీలిమిటేషన్తో లోక్సభ సభ్యుల సంఖ్యలో 50 శాతం పెరుగుదల ఉంటుందని వివరించారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 815కు చేరుకుంటుందని, ఇందులో 272 సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. దీంతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్
