అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CPR Awareness | సీపీఆర్తో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సీపీ కార్యాలయంలో బ్లూకోల్ట్స్ సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
CPR Awareness | అత్యవసర నైపుణ్యాలపై అవగాహన ఉండాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో (Arrive Alive Program) భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు (Road Accidents) వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదన్నారు.
ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, న్యూరాలజిస్ట్ రామణేశ్వర్, పీడియాట్రిస్ట్ శ్రీశైలం, అనస్తీసియా స్పెషలిస్ట్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు
