అక్షరటుడే, వెబ్డెస్క్ : Ambedkar Jayanti in Telangana | అంబేద్కర్ ఆలోచనలు, విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) నేపథ్యంలో ట్యాంక్బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తం చిందించకుండా దేశం గెలవొచ్చని గాంధీ ప్రపంచానికి చాటారన్నారు. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడవొచ్చని చెప్పిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. దేశానికి గాంధీ, అంబేద్కర్ రెండు కళ్లు అన్నారు. అంబేద్కర్ ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
Ambedkar Jayanti in Telangana | మహనీయుడు
ప్రపంచ దేశాలకే మన దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన మహనీయుడు అంబేద్కర్ అని సీఎం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశం బలంగా ఎదగడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచనలను, విధానాలను ప్రపంచం మొత్తం స్వాగతించిందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Jeevan Reddy Statement | రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి : మాజీ మంత్రి జీవన్రెడ్డి
