అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని(Arrive Alive program) నిక్కచ్చిగా నిర్వహించాలని.. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad police) పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
Arrive Alive program | పెండింగ్ కేసులను పరిష్కరించాలి..
ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సీపీ సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిజామాబాద్లో (Nizamabad) పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని సూచించారు.
Arrive Alive program | రోడ్డు ప్రమాదాల నివారణకు..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను (black spots) గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండేటటువంటి లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ఇన్ఛార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Employees Protest | రేపు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
