అక్షరటుడే, ఎల్లారెడ్డి: Artisan Workers Regularization | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలని ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్, రెగ్యులర్ పోస్ట్లలోకి కన్వర్షన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల (Former MLA Jajala) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయంలో కార్మికులు నిర్వహించిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.
Artisan Workers Regularization | కార్మికులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు..
ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయం (Yellareddy Divisional Office) వద్ద విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లోని ఎల్లారెడ్డి డివిజన్లో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. విద్యుత్ అర్టిజన్, అన్ మ్యాన్డ్, ఫీస్ రేటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తూ జీతాలను పెంచడం జరిగిందని కాని.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేస్తున్న అనాలోచిత పనుల వల్ల ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల ఉద్యోగ భద్రతను కల్పించకపొతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వెంటనే ఈ కార్మికులకు శాశ్వత హోదా కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
