అక్షరటుడే, ఎల్లారెడ్డి: Electric Shock | ఇంట్లో ఉన్న కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి(Yellareddy) మండలం హాజీపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది.
Electric Shock | హాజీపూర్ గ్రామానికి చెందిన..
హాజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి కేబుల్ టీవీ రిపేర్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తన ఇంట్లో ఉన్న పాత ఎయిర్ కూలర్ను మరమ్మతు చేసి వినియోగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో కూలర్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి రిపేర్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు వైర్ చేతికి తగలడంతో విద్యుత్షాక్కు గురయ్యాడు.
గమనించిన కుటుంబీకులు వెంటనే ఆయనను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (Yellareddy Government Hospital) తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. రాజిరెడ్డి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
