అక్షరటుడే, వెబ్డెస్క్ : Electricity Workers | విద్యుత్ కార్మికులు సమ్మె విరమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో విద్యుత్ కార్మికుల జేఏసీ నాయకులు శుక్రవారం చర్చలు జరిపారు. అనంతరం సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ కార్మికుల JAC నాయకులు హైదరాబాద్ (Hyderabad)లోని ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రిని శుక్రవారం ఉదయం కలిశారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల ప్రశంసలను పొందే విధంగా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్న విషయం, వేసవిలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుందన్న వాస్తవం తెలిసినప్పటికీ, ఇటువంటి కీలక సమయంలో ఆకస్మిక సమ్మెకు దిగడం సముచితం కాదని హితవు పలికారు.
Electricity Workers | చర్చలతోనే..
చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన భట్టి చెప్పారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా పరిష్కరించగలిగే సమస్యలపై ట్రాన్స్కో సీఎండీ (Transco CMD), కార్మికుల JACతో చర్చలు జరిపి, వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం
