అక్షరటుడే, వెబ్డెస్క్: Government Job Dowry Fraud | ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగులైన యువకులకు డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సర్కార్ కొలువు ఉంటే చాలు చాలా మంది తల్లిదండ్రులు ఏమి ఆలోచించకుండా అతడికి తమ కూతురిని ఇచ్చి వివాహం చేస్తున్నారు. అంతేగాకుండా కోట్ల రూపాయల కట్న కానుకులు సమర్పించుకుంటున్నారు. దీనిని క్యాష్ చేసుకోవాలని ఓ వ్యక్తి ప్లాన్ వేశాడు.
నల్గొండ జిల్లా మాడుగుల మండలం (Madugula Mandal) చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు గౌడ్(30) అనే యువకుడు జీవనోపాధి కోసం వచ్చి అల్కాపురి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన రాలేదు. దీంతో చర్లపల్లి ఎఫ్సీఐలో గ్రేడ్–3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నకిలీ ఐడీకార్డు సృష్టించి, అందరిని నమ్మించాడు. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాని చెప్పి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు.
Government Job Dowry Fraud | రూ.1.5 కోట్ల కట్నం
మధుగౌడ్కు నల్గొండ జిల్లా (Nalgonda District)కు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.1.5 కోట్ల కట్నం ఇచ్చేందుకు ఒప్పుకున్న అమ్మాయి తల్లిదండ్రులు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అతడు అమ్మాయిని తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నడవడికపై నిందలు వేశాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు నిజం తెలిసింది. మధుగౌడ్ ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదని, నకిలీ ఐడీ కార్డు (Fake ID card)తో మోసం చేశాడని గుర్తించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు : పీసీసీ చీఫ్
