అక్షరటుడే, బాల్కొండ: Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 127 బ్యాచ్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు.
Kalyana Lakshmi Gold Scheme | పెండింగ్లో ఉంచవద్దు..
బాల్కొండ (Balkonda) నుంచి 19మంది దరఖాస్తుదారులు, వేల్పూర్ 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీమ్గల్ 39 మంది దరఖాస్తుదారులకు చెందిన ఫైళ్లను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిశీలించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్లు ఫైళ్లను పెండింగ్లో ఉంచకుండా వెంటనే సంతకాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Kalyana Lakshmi Gold Scheme | బాధిత కుటుంబానికి పరామర్శ
బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి మేనమామ పొద్దుటూరి హన్మంత్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్ గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శింఆరు. అనంతరం హన్మంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి వెంకటేష్, లింబారెడ్డి, సర్పంచ్ రామ్ రాజ్, గాండ్ల రాజేష్, శరత్, నారాయణ, కన్నె పోశెట్టి, ఫయాజ్, బుస నరహరి, రాజగౌడ్, పాపాయి పవన్, ఇఫ్తికర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!
