అక్షరటుడే, కామారెడ్డి: Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు (scholarship pending) విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ (Private Colleges Management Association) రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం కామారెడ్డిలో (kamareddy news) నిర్వహించారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి, సెక్రెటరీ నరాల సుధాకర్, సభ్యులు పాల్గొని ఫీజు బకాయిలపై చర్చించారు.
Private Colleges in Telangana | నాలుగైదేళ్లుగా పెండింగ్లో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగైదేళ్లుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు (college management) ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. నాన్ ప్రొఫెషనల్ కళాశాలల బకాయిలు సుమారు కేవలం రూ.1,500 కోట్ల వరకు ఉన్నాయన్నారు. పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల పరిస్థితుల దృష్ట్యా తక్షణమే తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల ఎగ్జిక్యూటివ్ సభ్యులు హరిస్మరణ్ రెడ్డి, గురువేందర్ రెడ్డి, రాజు, మారయ్య గౌడ్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్ షా ఫైర్
