అక్షరటుడే, వెబ్డెస్క్ : Shastripuram ROB Opening | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతోంది. నిర్మాణం పూర్తయిన శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) శుక్రవారం ప్రారంభించారు.
Shastripuram ROB Opening | 30 నిమిషాలు ఆదా
మైలార్దేవ్పల్లి (Mylardevpally) నుంచి శాస్త్రిపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ. 71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వోబీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ వంతెన మైలార్దేవపల్లి, ఫలక్నుమా RTC డిపో మధ్య సిగ్నల్-రహిత కనెక్టివిటీని అందిస్తుంది. మొత్తం 490 మీటర్ల దూరం దీనిని నిర్మించారు. వెడల్పు 16.60 మీటర్లు కాగా.. నాలుగు లేన్ల రోడ్డు వేశారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (Railway Overbridge) ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం ద్వారా, వట్టేపల్లి మీదుగా మైలార్దేవపల్లి నుండి ఫలక్నుమా RTC డిపో వరకు నేరుగా ప్రయాణించే వారికి వీలు కల్పిస్తుంది.ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్లో డ్రగ్స్ కలకలం
